![](https://techclubai.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-16-at-6.14.10-PM.jpeg)
అమరావతి: పార్టీ కోసం కష్టపడిన వారి కోసం త్వరలోనే నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేస్తానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్భ వన్కు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ మాట్లాడారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బూత్లయి కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. కింది స్థాయి నుంచి ఎవరు ఎక్కడ పార్టీ కోసం పని చేశారో వారికే పదవులు దక్కేలా అధ్యయనం ప్రారంభించామని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు.