అమరావతి: పార్టీ కోసం కష్టపడిన వారి కోసం త్వరలోనే నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేస్తానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్భ వన్కు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ మాట్లాడారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బూత్లయి కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. కింది స్థాయి నుంచి ఎవరు ఎక్కడ పార్టీ కోసం పని చేశారో వారికే పదవులు దక్కేలా అధ్యయనం ప్రారంభించామని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు.
పన్నుల వసూళ్ల సేవలు ప్రారంభించిన బంధన్ బ్యాంక్
బంధన్ బ్యాంక్ తాజాగా ఆన్లైన్లో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల సదుపాయాన్ని ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా తమ కస్టమర్లతో పాటు కస్టమర్యేతరులు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఆదాయపు పన్ను శాఖకు చెందిన TIN 2.0 ప్లాట్ఫాం ద్వారా బ్యాంకు ఈ వసూళ్ల సేవలను…
Read more