![](https://techclubai.com/wp-content/uploads/2024/06/Pciture-3.jpeg)
బంధన్ బ్యాంక్ తాజాగా ఆన్లైన్లో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల సదుపాయాన్ని ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా తమ కస్టమర్లతో పాటు కస్టమర్యేతరులు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఆదాయపు పన్ను శాఖకు చెందిన TIN 2.0 ప్లాట్ఫాం ద్వారా బ్యాంకు ఈ వసూళ్ల సేవలను అందించనుంది. ఆర్బీఐ నియమించిన ఏజెన్సీ బ్యాంకుగా బంధన్ బ్యాంక్ తమ 1700 పైచిలుకు శాఖల ద్వారా ఆఫ్లైన్లో కూడా ప్రత్యక్ష పన్నుల చెల్లింపులను స్వీకరిస్తుంది.
ఈ లైసెన్సుతో బంధన్ బ్యాంక్ కస్టమర్లు, తమ ప్రత్యక్ష పన్నులను బ్యాంక్ యొక్క రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు పేమెంట్ గేట్వే (డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్) ద్వారా సౌకర్యవంతంగా, నిరాటంకంగా, వేగవంతంగా చెల్లించవచ్చు. నగదు, చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్తో వారు బ్యాంకుకు చెందిన ఏ శాఖలోనైనా కూడా పన్నులు చెల్లించవచ్చు. దేశవ్యాప్తంగా బంధన్ బ్యాంక్ ఖాతాదారులు, కస్టమర్యేతరులు నిరాటంకంగా ప్రత్యక్ష పన్నులను చెల్లించేందుకు ఈ సర్వీసు ఉపయోగపడగలదు.
బంధన్ బ్యాంకు ప్రస్తుతం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గాను ముప్ఫై ఐదింటిలో కార్యకలాపాలు సాగిస్తోంది. దేశవ్యాప్తంగా 6,300 పైచిలుకు బ్యాంకింగ్ అవుట్లెట్స్ పటిష్టమైన నెట్వర్క్తో 3.35 కోట్లకు పైగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది.
“కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డుకు ఏజెన్సీ బ్యాంకుగా కార్యకలాపాలను ప్రారంభించడం మాకెంతో గర్వకారణం. అధునాతన డిజిటల్ సామర్ధ్యాలతో బ్యాంకు అందిస్తున్న వివిధ ఉత్పత్తులకు ఇది అదనం” అని బంధన్ బ్యాంక్ హెడ్ (గవర్నమెంట్ బిజినెస్ గ్రూప్) శ్రీ దేబ్రాజ్ సాహా (Debraj Saha) తెలిపారు.