అంతక్రియలు చేస్తున్న కుటుంబ సభ్యులు షాక్.. చనిపోయాడునుకున్న వ్యక్తి తిరిగొచ్చాడు
వికారాబాద్ జిల్లా నవాంద్గీ గ్రామానికి చెందిన ఎల్లప్ప అనే వ్యక్తి రెండు రోజుల క్రితం తాండూరుకు వెళ్లి సిమెంటు బస్తాలు మోసే హమాలీగా చేరాడు. అక్కడే పనిచేసే ఓ గుర్తుతెలియని వ్యక్తి, ఎల్లప్ప కలిసి తాండూరులో మద్యం తాగారు.
ఎల్లప్ప మత్తులోకి జారుకోగానే.. అతడి వద్ద ఉన్న డబ్బులు, మొబైల్ ఫోన్ తస్కరించి పారిపోతుండగా వికారాబాద్ రైల్వే స్టేషన్లో పట్టాలు దాటుతూ రైలు ఢీకొని అతడు మృతి చెందాడు.
అయితే అక్కడ లభించిన సెల్ ఫోన్ లోని కాల్ డేటా ఆధారంగా అతడిని ఎల్లప్పగా భావించి కుటుంబ సభ్యులకు రైల్వే పోలీసులు సమాచారం అందించారు.
మృతదేహం ముక్కలై ఉండటంతో.. ఎల్లప్పదేనని పొరపాటు పడి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని వారి గ్రామానికి తీసుకెళ్లారు.
అయితే అక్కడే పనిచేస్తున్న బషీరాబాద్, నవాంద్దీకి చెందిన కొందరు హమాలీలు ఆదివారం ఉదయం ఎల్లప్పను గమనించారు. అతని వద్దకు వెళ్లి మాట్లాడగా.. అసలు విషయం బయటపడింది.
దీంతో కుటుంబ సభ్యులకు ఎల్లప్ప ఫోన్ చేసి అంత్యక్రియల్ని ఆపేయాలని చెప్పాడు. అనంతరం స్వగ్రామానికి చేరుకున్నాడు.
జగన్కి వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు
జగన్కి వెన్నుపోటు. పొడిచింది ఎవరో కాదు కోమటిరెడ్డి! జగన్ లోటస్ పాండ్ వద్ద కట్టడం కూల్చివేత చేయించింది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డినే.. స్వయంగా చెప్పిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో జరిగిన చిట్ చాట్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో జగన్…
Read more